హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డివిజన్లో మరమ్మతులు, ఎలక్ర్టిఫికేషన్, మోడలింగ్ వంటి అభివృద్ధి పనుల కారణంగా తిరుపతిమార్గంలో 18 రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దుచేశారు. ఇందులో కొన్ని రైళ్లు వారంరోజులు, మరికొన్ని రెండు రోజులు.. మరమ్మతుల అవసరాన్ని బట్టి రద్దుచేశారు. రెండు రైళ్లకు హాల్టింగ్ నిలిపివేశారు. మరో ఏడు రైళ్లను రేణిగుంట తిరుపతి వెళ్లే మార్గాల్లో నిలిపివేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.