న్యూఢిల్లీ: అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నీలో భారత జోరు కొనసాగుతున్నది. తొలి రోజు ఓ స్వర్ణం నెగ్గిన భారత బాక్సర్లు.. రెండో రోజు మరో రెండు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వింకా (60 కేజీలు), సనమ్చా చాను (75 కేజీలు) ఫైనల్లో అదరగొట్టి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. మాంటెనెగ్రో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రోజు రెండు స్వర్ణాలతో పాటు మన బాక్సర్లు మరో రెండు రజతాలు, మూడు కాంస్యాలు చేజిక్కించుకున్నారు.