హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు ట్రాఫిక్ అనుమతించరు, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి చాపల్రోడ్డు, నాంపల్లి వైపు వెళ్లాలి.
అబిడ్స్, గన్పౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు వచ్చే వాహనాలను, ఎస్బీఐ గన్పౌండీ నుంచి చాపల్రోడ్డు వైపు వెళ్లాలి.
బషీర్బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ వైపు వెళ్లే వాహనాలు బషీర్బాగ్ జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్కోఠి రోడ్డులో వెళ్లాలి.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలు, హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
లిబర్టీ జంక్షన్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను, హిమాయత్నగర్ వైపు మళ్లిస్తారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళ్లే వాహనాలు బషీర్బాగ్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ స్థలాలు
బహిరంగ సభకు వస్తున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఏ రూటు నుంచి వచ్చేవారు వారికి కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సాంస్కృతిక కార్యక్రమాల బృందాలు గేట్ - డి, ఇ వద్ద ఆగాలి, సాట్స్ కార్యాలయం నుంచి లోపలికి వెళ్లాలి. తమ వాహనాలను ఎస్సీఆర్టీ, ఎస్ఎస్ఏ, అగ్రికల్చర్ అఫీస్, అలీ మోడల్ స్కూల్, మెహబూబ్ కాలేజీ, నిజాం కాలేజీ గ్రౌండ్లో పార్కు చేసుకోవాలి.
కార్పొరేటర్లు, మీడియా సిబ్బంది గేట్ బి వద్దకు వచ్చి ఆగాలి. పీసీఆర్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ జంక్షన్, బి-గేట్ ద్వారా లోపలికి రావాలి. తమ వాహనాలను స్టాన్లీ స్కూల్, స్టాన్లీ కాలేజ్, హాజ్ హౌస్ పార్కు చేసుకోవాలి.
సికింద్రాబాద్, ట్యాంక్బడ్ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీస్టేడియం జి-గేట్ వద్దకు వచ్చి అగాలి, సభకు వచ్చే వారు గేట్ 14, 15 నుంచి లోపలికి రావాలి. వాహనాలు పబ్లిక్ గార్డెన్, రవీంధ్రభారతి, ఐమాక్స్ ధీయేటర్ పక్కనే ఉన్న డాక్టర్ కార్స్ పార్కింగ్లో పార్కు చేసుకోవాలి.
మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు గేట్ - జి వద్ద ఆగాలి, 14, 15 గేట్ల ద్వారా సభకు లోపలికి వెళ్లాలి, వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్ 2, 3లో పార్కు చేయాలి.
ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఓల్డ్సిటీ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ఆగాలి, లోపలికి గేట్ ఎ, 16, 17 నుంచి వెళ్లాలి. వాహనాలను పబ్లిక్గార్డెన్, పిపుల్స్ ప్లాజాలో పార్కు చేయాలి.
ముషీరాబాద్, అంబర్పేట్, హిమాయత్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు గేట్ ఎఫ్, ఎఫ్-1, జీ వద్ద వద్ద ఆగాలి, గేట్ నెం. 6, 7, 8 9, 10 నుంచి లోపలికి వెళ్లాలి. వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్ - 2, 3లో పార్కు చేయాలి.
ద్విచక్రవాహనాలు, కార్లపై వచ్చే వాళ్లు గేట్ ఎ, ఎఫ్, ఎఫ్ 1, జి వద్ద ఆగాలి. గేట్ నెం. 6, 7,8,9,10 నుంచి లోపలికి వెళ్లాలి. పార్కింగ్ స్థలం నిజాం కాలేజీ గ్రౌండ్ - 1.